నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వాహనాలను మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మంగళవారం పరిశీలించారు.ఎన్నికల సిబ్బందిని, పోలింగ్ సామగ్రిని తరలించే క్రమంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సిబ్బందిని కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా చేరవేయాలని ఆదేశించారు. వాహనాల ఫిట్నెస్, రూట్ మ్యాప్పై అధికారులకు సూచనలు చేశారు.
