మంగళగిరి ఫిబ్రవరి 10 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్ అలీం భాషా మంగళగిరి లోని లక్ష్మీ నరసింహా స్వామి కాలనీ లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా, పారిశుధ్య సంబంధిత అంశాలపై అధికారులకు అనేక సూచనలు ఇవ్వడమే కాకుండా, తడి చెత్త మరియు పొడి చెత్తను వేరు చేసి సేకరించాలని దోమల నివారణ యాంటీ లార్వల్ యాక్టివిటీస్ (స్ప్రేయింగ్, ఫాగింగ్) ప్రతి వార్డులలో నిర్వహించాలని సూచించారు. అనంతరం, కాజ గ్రామం నందలి పార్కు మరియు ఎన్నారై వద్ద ఉన్న వైట్ ఫీల్డ్ పార్కులను ఇంజనీరింగ్ మరియు హార్టికల్చర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ రెండు పార్కుల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో డీ ఈ ఈ రమేష్,ఉద్యాన అధికారి రామారావు ఏ ఈ ప్రసన్న,తదితరులు పాల్గొన్నారు.
