Breaking News

మార్వాడీలు వారి స్వరాష్ట్రాలకు వెళ్లి పోవాలి.

పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): స్థానిక వర్తకుల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న మార్వాడీలు దుకాణాలు పెట్టకుండా వారి రాష్ట్రానికి వెళ్లి పోవాలని వేంపల్లె వ్యాపారస్తుల సంఘం డిమాండ్ చేశారు. బుధవారం మర్వాడి దుకాణాలపై స్థానిక పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులకు వేంపల్లె వ్యాపారస్తుల సంఘం తరుపున టిడిపి ఇన్చార్జ్ రఘునాథరెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి మార్వాడిలు వేంపల్లెకు వచ్చి దుకాణాలు పెట్టడం వలన స్థానికంగా ఎలక్ట్రికల్, వస్త్ర, హార్డ్ వేర్, ఫ్యాన్సీ స్టోర్ దుకాణాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారని చెప్పారు. అయితే రాజస్థాన్, తమిళనాడు, కేరళ నుండి మార్వాడిలు వేంపల్లెకు వచ్చి పెద్ద పెద్ద దుకాణాలు పెట్టడం వలన స్థానికంగా ఉన్న వారి జీవనాధారంకు ఇబ్బంది కలుగుతున్నట్లు చెప్పారు. మార్వాడీలు సరుకులను చాలా తక్కువ ధరలకు అమ్ముతూ 50 శాతం వరకు నకిలీ వస్తువులను విక్రయిస్తున్నారని, దీనివల్ల స్థానిక వ్యాపారులు పోటిని తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. రాజస్థాన్, తమిళనాడు, కేరళ నుండి వచ్చే వ్యాపారస్తులకు అడ్డుకట్ట వేయాలని కోరారు. వస్త్ర, బంగారం, కిరాణా, రిటైల్ వ్యాపారాలను మార్వాడీలు పూర్తిగా స్వాధీనం చేసుకుని, స్థానిక వర్తకుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని వాపోయారు.

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ఆర్టీసీ బస్సులు – ఆర్టీసీ సిబ్బందితోనే నడవాలి…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *