Breaking News

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య.

పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వేంపల్లెలోని తాళ్ళపల్లె గ్రామానికి చెందిన సి. మణికంఠ రెడ్డి (25) అనే రైతు అప్పుల బాధతో మృతి చెందాడు. మృతిని బంధువు నాగార్జున రెడ్డి పిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తాళ్ళపల్లె గ్రామానికి చెందిన వెంకట లక్ష్ముమ్మ కుమారుడు సి. మణికంఠరెడ్డి తనకు ఉన్న 5 ఏకరాల పోలంలో అరటితో పాటు ఆయా పంటలు సాగు చేసుకొని జీవనం సాగిస్తుంచే వాడు . అయితే సాగు చేసిన పంటల్లో గిట్టుబాటు కాకపోవడంతో ఆదాయం రాలేదని తెలిపారు. పంటల సాగు చేసేందుకు నీరు లేక పోవడంతో మృతుడు మణికంఠ రెడ్డి బోర్లు వేయడానికి దాదాపు రూ 15 లక్షలు అప్పులు చేసినట్లు బంధువులు తెలిపారు. అప్పులు తెచ్చి బోర్లు వేసినప్పుటికి నీళ్లు పడక పోవడంతో అప్పులు ఎక్కువ అయినట్లు తెలిపారు. తెచ్చిన అప్పులు తీర్చలేక జనవరి 17 వ తేదిన తాళ్ళపల్లె గ్రామంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గడ్డి మందు తాగిన విషయం తెలుసుకున్న బంధువులు చిక్సిత కోసం కడప, కర్నూలు, ప్రాంతాల్లోని ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి సరిగా లేక పోవడంతో పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మంగళవారం రాత్రి రైతు మణికంఠరెడ్డి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.మృతునికి తల్లితో పాటు 9 నెలల చిన్నారి ఉంది. బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ఆర్టీసీ బస్సులు – ఆర్టీసీ సిబ్బందితోనే నడవాలి…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *