Breaking News

ఆర్టీసీ బస్సులు – ఆర్టీసీ సిబ్బందితోనే నడవాలి…!

విజయవాడ. ఫిబ్రవరి 11 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విద్యుత్ బస్సుల పేరుతో ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్య లను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ప్రధాన మంత్రి ఈ-బస్ పథకం పేరుతో పూణేకు చెందిన పినకల్ కంపెనీకి 11 డిపో ల పరిధిలోని 12 స్థలాలను కేటాయించాలన్న నిర్ణయం ఆర్టీసీ భవిష్యత్తుకు ప్రమా దకరమని, విద్యుత్ బస్సు లు నేరుగా ఆర్టీసీ సంస్థ ద్వారానే నిర్వహించాలని అలాగే విద్యుత్, సి.ఎన్.జీ, డీజిల్ బస్సులు అన్నీ ఆర్టీ సీ సిబ్బందితోనే నడపాలని డిపోలను ప్రైవేట్ కన్సార్టి యంలకు అప్పగించే నిర్ణ యాలు రద్దు చేయాలని విద్యుత్ బస్సుల మౌలిక వసతులు ప్రభుత్వమే కల్పించాలని ఆర్టీసి ఇ.యు రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, ప్రధానకా ర్యదర్శి జి.వి.నరసయ్య బుదవారం ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.
అలాగే డిపోలకు డిపోలు పూర్తిగా ప్రైవేట్ వారికి అప్పగించడం సంస్థకు నష్టదాయకమని విజయ వాడ (విద్యాధరపురం), గుంటూరు-2, నెల్లూరు-2, తిరుపతి (మంగళం) డిపో లను పూర్తిగా ప్రైవేట్ విద్యుత్ బస్సు యజమా నులకు అప్పగించడం సంస్థ ప్రయోజనాలకు విరుద్ధమని, మిగిలిన డిపో లను పాక్షికంగా ఇవ్వాలన్న నిర్ణయమూ హానికరమని, ప్రైవేటీకరణ యత్నాలు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చ రించారు. అలాగే విద్యుత్ బస్సుల కొరకు మౌలిక వసతులకు (ఇన్ఫ్రాస్ట్రక్చ ర్) ప్రభుత్వమే స్థలాలను ఇవ్వాలని, విద్యుత్ బస్సు ల ఏర్పాటుకు సంబంధించి న అంశాలపై ఆర్టీసీలో ఉన్న యూనియన్లు, అసో సియేషన్ల ఉమ్మ డి సమా వేశం నిర్వహించి ఆర్టీసిని భలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి చేసారు.

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

విబి జీరాంజీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *