విజయవాడ. ఫిబ్రవరి 12 సెంట్రల్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి జాతీ య యువజన వ్యవహారా లు, SAI జాయింట్ సెక్రెటరీ వినీల్ కృష్ణతో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాయచోటి నియోజకవర్గం లో క్రీడల అభివృద్ధికి అవస రమైన నిధులు, ఖేలో ఇండియా పథకం కింద ప్రతిపాదనల ఆమోదం, అలాగే ఆంధ్ర ప్రదేశ్ను దేశంలోనే అగ్ర శ్రేణి క్రీడా హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వా నికి అదనపు నిధులు మం జూరు అంశాలపై సుదీర్ఘం గా చర్చించారు. ఈ సమా వేశంలో బీజేపీ జాతీయ నాయకులు సాయి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
