Breaking News

రెడ్డి కుంటలో ఫ్రూట్ కవర్స్ ను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ

మైలవరం, ఫిబ్రవరి 12: (తెలుగు పత్రిక): ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రెడ్డి కుంట గ్రామంలో చేబ్రోలు బ్రదర్స్ మామిడి తోటల్లో కట్టిన ఫ్రూట్ కవర్స్ ను జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ గురువారం నాడు పరిశీలించారు. రైతులతో కలిసి పరిశీలించిన అనంతరం కలెక్టర్ ఫ్రూట్ కవర్స్ తో మామిడికి మంచి ధర, నాణ్యమైన మామిడి మరియు చీడపీడల నుండి రక్షణ కలుగుతుందనీ కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయంపై ముక్కువ చూపాలన్నారు. ముందస్తుగా వచ్చిన మామిడికి ఫ్రూట్ కవర్స్ కట్టిన రైతులను ఆయన ప్రశంసించారు. రెడ్డిగుంట గ్రామ రైతులును ఇతర రైతులు ఆదర్శంగా తీసుకుని ఫ్రూట్ కవర్లు కట్టే విధంగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు.ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై ఫ్రూట్ కవర్లను అందిస్తామన్నారు. ఫ్రూట్ కవర్లు కట్టిన మామిడికాయలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరువూరు ఆర్డీవో కే మాధురి, తాసిల్దార్ జె సుశీల దేవి, మండల టిడిపి అధ్యక్షులు. జె వేణుగోపాల్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ చేబ్రోలు రాజు, కిరణ్ కుమార్ రెడ్డి,చేబ్రోలు కొండ, చేబ్రోలు కృపా రాజు, కొండపల్లి పరమేశ్వర రావు, మరీదు లక్ష్మీనారాయణ, చేబ్రోలు సాంబశివరావు, పిడపర్తి రామిరెడ్డితో పాటు పలువురూ రైతులు పాల్గొన్నారు.

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

పీహెచ్ సి లో చికిత్స పొందుతున్న బాలికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *