గుంటూరు (తెనాలి) (నేటి తెలుగు దిన పత్రిక ప్రతినిది), ఫిబ్రవరి 12 : ఉపాధి హామీ పనులు (జి రామ్ జి పనులు) వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు.జిల్లా నీటి యాజమాన్య సంస్థ,పంచాయతీరాజ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నాటికి నిర్దేశించిన లక్ష్యాలు విధిగా పూర్తి కావాలని స్పష్టం చేశారు. పనులు పూర్తి చేయుటకు ప్రతి రోజు, ప్రతి వారం వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని ఆదేశించారు. పూర్తి చేసిన పనులకు వెంటనే బిల్లులు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. పనులు వేగవంతానికి స్పష్టమైన కార్యాచరణ తయారు చేసుకోవాలని అన్నారు. మండల స్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పర్యవేక్షణ పక్కాగా ఉండాలని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
