కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు .
కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో శుక్రవారం జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో నియమ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అభ్యర్థులను కోరారు.
గురువారం రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ “కౌంటింగ్ కేంద్రానికి కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులు, ఏజెంట్లు శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిగా అనుసరించాలన్నారు. ప్రతి రౌండ్ను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఎటువంటి సందేహాలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకు రావాలి,” అని తెలిపారు. కౌంటింగ్ హాల్లో క్రమశిక్షణ పాటించడం అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని, కౌంటింగ్ సిబ్బందితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
అభ్యర్థులు ఏజెంట్లు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలని, అనుమతించిన నియమాల మేరకు మాత్రమే వ్యవహరించాలని వెలిచాల రాజేందర్ రావు అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిం చాలని రాజేందర్ రావు కోరారు.
