Breaking News

పోలింగ్ ప్రక్రియ కు భారీ బందోబస్తు.

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. గురువారం కరీంనగర్ లోని అస్త్ర కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన పోలీస్ బ్రీఫింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు కౌంటింగ్ కేంద్రం వెలుపల 100 మీటర్ల దూరం నుండే తనిఖీలు ప్రారంభమవుతాయి. అనుమతి పత్రాలు (Passes) ఉన్న వారిని మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తారు.ఏజెంట్లు, అభ్యర్థులు, సిబ్బంది తమ వెంట అగ్గిపెట్టెలు, సిగరెట్లు, వాటర్ బాటిళ్లు, ద్రవ పదార్థాలు (Liquids), మరియు ఇతర ఫ్లెమబుల్ (మంటలు చెలరేగే) వస్తువులను తీసుకురావడంపై పూర్తిగా నిషేధం విధించారు.ఎన్నికల కమిషన్ జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు.

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

​ కౌంటింగ్ కేంద్రాల వద్ద మరియు నగర వ్యాప్తంగా నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తూ నిఘా ఉంచుతామని సీపీ తెలిపారు.కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. డీజే (DJ) వినియోగంపై పూర్తి నిషేధం ఉందని, నిబంధనలు అతిక్రమిస్తే డీజే పరికరాలను సీజ్ చేయడమే కాకుండా సంబంధిత వ్యక్తులపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఎన్నికల ఫలితాల వేళ ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని సీపీ గౌష్ ఆలం కోరారు.

పీహెచ్ సి లో చికిత్స పొందుతున్న బాలికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *