సర్పంచ్ కడియాల పద్మ అప్పయ్య.
హుజూర్నగర్ ,ఫిబ్రవరి 12 నేటి తెలుగు పత్రిక: సూర్యాపేట జిల్లా ,గరిడేపల్లి మండలంలో గ్రామీణ ప్రాంతాలలో పాడి గేదెలను, మరియు పశువులను పెంచుకోవడం ద్వారా, ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు గ్రామ ప్రజలు తాజా పాలను కూడా సేవించి ఆరోగ్యకరంగా ఉండవచ్చునని గానుగబండ గ్రామ సర్పంచ్ కడియాల పద్మ అప్పయ్య అన్నారు.మంగళవారం గానుగబండ గ్రామంలో పశువులకు వైద్యానికి అనుకూలంగా ఉండటానికి నూతనంగా పశువుల బోనును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశువులు ఉన్న ప్రతి ఒక్కరు దీనిని వినియోగించుకోవాలని, పశువులకు టీకాలు వేసే సమయంలో గాని,ఇంజక్షన్లు ఇవ్వటానికి గాని,పశువుల క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు గాని,ఈ పశువుల బోను ఉపయోగపడుతుందని దీనిని పశువులు ఉన్న రైతులందరూ సద్వినియోగపరుచుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సయ్యద్ నాగుల మీరా, గ్రామపంచాయతీ కార్యదర్శి శివ, గోపాలమిత్ర గోపి,వార్డు నెంబర్లు, గ్రామ పెద్దలు,పాడి రైతులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
