రాయచోటి, ఫిబ్రవరి 13(నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో టమాటా రైతులకు గిట్టుబాటు ధర లేనందువలన అనంతపూర్ ఏడిఎమ్ రాయచోటి మార్కెట్ యార్డుకు టమాటాలు పంపినారు వీటిని రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో వినియోగ దారుల ఇండ్ల వద్దకే చేర్చడం జరిగింది. టమాటాలు కొనుగోలు చేసి పరిసర ప్రాంతంలోని వినియోగదారులకు సరఫరా చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి డైరెక్టర్ కోటికొండ రఘునాథ, యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.
