యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన ఖాతాను తెరిచింది. ఒకటో వార్డు నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం సాధించారు. ఈ ఫలితాలు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీజేపీకి అంచనాలు పెంచుతున్నాయి.
