విజయవాడ. ఫిబ్రవరి 13 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నగరంలో దోమల నివార ణకు ప్రతిఒక్కరూ సహక రించాలని నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు కోరారు. ఫ్రైడే-డ్రైడే సందర్భంగా ఎల్ బి ఎస్ నగర్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అవ గాహన ప్రదర్శనలు నిర్వ హించారు. దోమల లార్వా గుర్తించి నిర్మూలన చర్యలు చేపట్టారు. అధికారులు మాట్లాడుతూ దోమలు పెర గకుండా ప్రజలు చర్యలు తీసుకోవాలని అన్నారు. తమ ఇళ్ల లోని పాత్రలు, ఇతర వస్తువులు, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండ కుండా చూడాలని తెలిపా రు. కార్పొరేషన్ పరంగా దోమల నిర్మూలనకు చర్య లు తీసుకుంటున్నామని వెల్లడించారు. బయోలజీస్ట్ కామేశ్వరరావు, ఇన్ఛార్జ్ డి ఎం ఓ, డాక్టర్ సునీల్, యు పి హెచ్ సి వైద్య అధి కారి డాక్టర్ రాజు, సబ్ యూనిట్ అధికారి రామ చంద్ర రెడ్డి, శానిటరీ ఇన్స్పె క్టర్లు, మలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

