పులివెందుల ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కుప్పం నియోజక వర్గ యంగ్ ప్రొఫెషనల్ స్వర్ణాంధ్ర 2047 ఓబుళరెడ్డి ధనుంజయ రెడ్డి పెళ్ళికి ఆహ్వానించారు. మార్చి నెల 4 వ తీదీన పులివెందుల లో జరిగే తన పెళ్లికి రావాలని.. పెళ్లి ఆహ్వాన పత్రిక అందజేసి విన్నవించారు. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం, నారేపల్లి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు, మోపురి దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ ఓబుల్ రెడ్డి వెంకటరమణారెడ్డి కుమారుడు ధనుంజయ రెడ్డి. ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ లతో కలిసి వెళ్లి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను ఆయన అందజేశారు.
