Breaking News

ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులురూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిటి

పులివెందుల ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడులలో పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు డిటి నాగేంద్ర కుమార్ దొరికిపోయాడు. ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి సీతారామారావు మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం కుమార కాల్వ గ్రామంలో మసీదుకు సంబంధించిన సుమారు 30 ఎకరాల పొలాలను కొంతమంది ఆక్రమించుకొని అక్రమంగా పట్టాలు పొందారన్నారు. ఈ విషయమై సదరు కుమార కాలువ గ్రామ నివాసి కరీముల్లా 2024 నవంబర్లో కడప కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారన్నారు. అనంతరం సదర్ డిటి నాగేంద్ర కుమారులు కలుసుకొని ఆక్రమించిన భూములను మసీదు పేరిట బదలాయించాలని కోరారు అన్నారు. తనకు పదివేల రూపాయలు లంచం ఇస్తే భూములను మసీదుకు వదల ఇస్తానని డిటి తెలియజేశారు. దీంతో కరీముల్లా కడప ఏసీబీ కార్యాలయానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాను తన సిబ్బందితో కలిసి స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో డీటీని కలిసామన్నారు. లంచం తీసుకున్న విషయం దొరికిపోవడంతో వీటిని అదుపులోకి తీసుకోవడంతో పాటు అతను వసూలు చేసిన పదివేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ విషయమై మరింత లోతుగా విచారించి విచారణ అనంతరం డిటి నాగేంద్ర కుమార్ ను కర్నూల్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వెల్లడించారు.

ఫలించిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య వ్యూహం

కరీంనగర్ కార్పొరేషన్ లో వికసించిన కమలం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *