మంత్రి నారా లోకేష్ సేవాస్ఫూర్తితో సేవా కార్యక్రమం.
టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి.
ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం – డా. మాధవిలత.
మంగళగిరి ఫిబ్రవరి 13 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిరంతరంగా 46 వారాలుగా విజయవంతంగా కొనసాగుతున్నట్లు డాక్టర్ మాధవిలత తెలిపారు. మంత్రి నారా లోకేష్ సేవాస్ఫూర్తితో, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని ప్రతి గురువారం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.సన్ ఫ్లవర్ హ్యాండ్లూమ్ వస్త్ర దుకాణం వద్ద ప్రతి గురువారం నిర్వహిస్తున్న ఈ శిబిరం ద్వారా వారానికి వందమందికి పైగా రోగులకు ఉచిత హోమియోపతి వైద్యం అందించడంతో పాటు అవసరమైన మందులను కూడా పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఈ వైద్య శిబిరం ద్వారా విశేషంగా లబ్ధి పొందుతున్నారని వారు పేర్కొన్నారు.ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన హోమియోపతి వైద్యులు పాల్గొని సాధారణ రోగాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రత్యేకంగా దీర్ఘకాలిక వ్యాధులు, చర్మవ్యాధులు,కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, ఆయాసం,నీరసం, అలెర్జీలు వంటి సమస్యలకు వైద్యం అందుతుండటంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.ఈ సేవలను మరింత విస్తృతంగా కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.
