యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలేరు మాజీ శాసన సభ్యురాలు మాజీ ప్రభుత్వవిప్ శ్రీమతి శ్రీ గొంగిడి సునీత మహేందర్ రెడ్డిగారు రహీంఖాన్ పేట గ్రామంలోని పురాతనమైన శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో హోమం లో పాల్గొని,ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుదగాని కళావతి, లింగయ్య గౌడ్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చందర్ గౌడ్, జిల్లా నాయకులు కోరే బిక్షపతి,కాంబోజు భాను ప్రకాష్, మాజీ సర్పంచ్ మల్లెల పర్వతాలు, పార్టీ సీనియర్ నాయకులు నర్సిరెడ్డి, యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి దుంప పరుశరాములు, మాజీ గ్రామశాఖ అధ్యక్షులు మెరుగు అంజయ్య, ఆవుల మల్లయ్య , కప్పే వెంకన్న, జోగు మచ్చగిరి, తాళ్లపెల్లి సాయికుమార్ , ఏముడాల ఆంజనేయులు , తాళ్లపెల్లి నర్సయ్య , బూడిది మహేష్ , కర్రే నవీన్ , కర్రే మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
