విజయవాడ. ఫిబ్రవరి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాయచోటి మున్సిపాలిటీకి రెండో వెలుగులు లైన్ విడత త్రాగునీటి సరఫరా కోసం రూ.150 కోట్ల కేటాయింపులు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి సచివాలయంలో భేటీ అయ్యి ప్రతిపాదించారు.అలాగే వెలుగులు కెనాల్ (కాలువ) మరమ్మతులు, విస్తరణ పనుల కోసం రూ.75 కోట్ల నిధులు మం జూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ని మంత్రి మనవి చేశారు. ఈ సందర్భంగా హంద్రీ నీవా ప్రాజెక్ట్ ద్వారా రాయచోటికి త్రాగు నీరు, సాగునీరు అందిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రహదారుల శాఖ, క్రీడ శాఖల మంత్రి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
