యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా గ్రామ సర్పంచ్ “బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్”దంపతులు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ గుండె గాని ఐలయ్య గౌడ్,బీజేపీ మండల అధ్యక్షులు గజరాజు కాశీనాథ్, బబ్బూరి శివలింగం గౌడ్,బి.ఎల్ నారాయణ గౌడ్ దంపతులు, ప్రతి కంఠం శంతాన్ రాజు దంపతులు, లోడి శంకర్ గౌడ్ దంపతులు, లోడీ పరశురాములు, సూర్య, గర్దాసు లింగయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
