కరీంనగర్, ఫిబ్రవరి -15, నేటి తెలుగు పత్రిక: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లతో పాటు ఎన్నికల కోడ్ అమలునేపథ్యంలో కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.అధికారులు అందరూ ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు.ప్రజలు గమనించాలని కలెక్టర్ కోరారు.
