పామర్రు, (కృష్ణా) ఫిబ్రవరి 15,నేటి తెలుగు పత్రిక : శివనామస్మరణతో శివాలయాలు మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పామర్రు మండలంలోని శివాలయాల్లో తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు పూజలు ప్రారంభించారు. నియోజకవర్గం కేంద్రంమైన పామర్రు పట్నంలో వేంచేసి ఉన్నా శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయం లో ఆదివారం రాత్రి నిర్వహించిన శివ పార్వతి ల కళ్యాణ మహోత్సవoలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, స్థానిక ప్రముఖలు హాజరైనారు. భక్తులు కు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా మేనేజర్ జె వి ఆర్ ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇదే విదంగా మండలం లోని రాపర్ల, కొండి పర్రు, ప్ర్రాకార్ల గ్రామాల్లో గల శివాల యాలల్లో మహా శివ రాత్రి సందర్బంగా ప్రత్యేక పూజల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి వార్లు తీర్ద ప్రసాదాలు అందుకున్నారు.
