Breaking News

నేడు ప్రజాల సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ.

విజయవాడ. ఫిబ్రవరి 15 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఫిబ్రవరి 16వ తేదీన అనగా సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం పబ్లి క్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అదే విధంగా కలెక్టర్ కార్యాయ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ సేవలు కూడా అందు బాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదే విధంగా అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకు నేందుకు 1100 కి నేరుగా కాల్ చేయవచ్చన్నారు.

శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు.

సామాజిక సేవలో త్రిబుల్ ఐటీ విద్యార్థులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *