పులివెందుల ఫిబ్రవరి 15 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భేష్ అని బిజెపి సీనియర్ నేత కేతిరెడ్డి తిరుపాల్ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టారని తెలిపారు. రెండుమూడేళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. వైకాపా విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. ఇబ్బందులు అధిగమించి ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సమస్యలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందన్నారు. కేంద్ర సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామని, వ్యవసాయం, సేవారంగాల నుంచి ఎక్కువ ఆదాయం రావాలన్నారు. రెండుమూడేళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందన్నారు. అక్కడి రోడ్లను జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని అమరావతికి రాకపోకలు పెరిగి ఆదాయమూ వస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ ముఖచిత్రం మారుస్తుందన్నారు.
