యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కాచారం శ్రీ గౌరీ రేణుకా వాసవి బసవ లింగేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆదివారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను కలిసి వారికి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అలాగే ఇటీవల కాచారం శ్రీ గౌరీ రేణుక వాసవి బసవలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఆలయ వార్షికోత్సవ వేడుకలు, శివపార్వతుల కళ్యాణం, రేణుక మాత కళ్యాణం ప్రసాదం అందజేయడం జరిగిందని అన్నారు.
