యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి , భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు వేడుకలు యాదగిరిగుట్టలో వైకుంఠ ద్వారం సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరంఈ సందర్భంగా బీఆర్ఎస్ టౌన్ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా కీర్తి గణించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని, ప్రజా రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగిందని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన మహోన్నత వ్యక్తిగా చరిత్ర సృష్టించిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ టౌన్ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు కోల వెంకటేష్ గౌడ్, ముక్కెర్ల సతీష్ యాదవ్, శారాజి రాజేష్, చిత్తర్ల బాలయ్య గౌడ్, గంగసాని నవీన్, కంసాని స్వామి, నరసింహారెడ్డి, సతీష్ భట్, దాసరి బాలగురువయ్య, మిట్ట శివ, బూడిద స్వామి, ఎస్కే నజీర్, సర్ధార్, చిరంజీవి, మాటూరి బాలయ్య, మోతె బాలు, శ్రీను, గౌటి నరసింహ పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
