మున్సిపల్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ కడకంచి బాలమణి.
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల్లో రంగంలోకి దిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. ఇదే సందర్భంలో ఇరు పార్టీల కోరం సమానంగా ఉండడంతో చిట్టీలతో డ్రా తీయడంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కడకంచి బాలమణి చైర్మన్ గా ఎన్నికయ్యారు.
