పామర్రు, ఫిబ్రవరి 18( నేటి తెలుగు పత్రిక ) : గ్రామాల సంపూర్ణ అభివృద్ధి సాధన కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు నిలుస్తున్నాయని పామర్రు మండల అభివృద్ధి అధికారి జ్యోతి అన్నారు. మండల పరిధిలోని పసుమర్రు గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో నూతనంగా నిర్మితమవుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను ఆమె బుధవారం పరిశీలించారు. 7. 5 లక్షల నిధులతో గ్రామంలోని కాజ సీతారామయ్య ఇంటి వద్ద నుంచి వి సూర్యనారాయణ ఇంటి వరకు ఈ నూతన సిసి రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వివరించారు. నాణ్యత ప్రమాణాలకు దీటుగా రహదారి నిర్మాణాలను దరితిగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత కాంట్రాక్టర్ పై ఉందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పద్మశ్రీ వేణి సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
