నేటి తెలుగు పత్రిక: భారతదేశం–బ్రెజిల్ సంబంధాలలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, వ్యవసాయ రంగం వంటి అంశాల్లో కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. అధ్యక్షుడు లూలా మరియు ఆయన ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి స్వాగతిస్తూ ప్రధాని మోదీ, భారత్–బ్రెజిల్ సంబంధాలు దశాబ్దాలుగా పరస్పర విశ్వాసం, స్నేహంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
ఇద్దరు నాయకులు గత కొన్నేళ్లుగా అనేక అంతర్జాతీయ వేదికల్లో సమావేశమయ్యారు. ప్రతిసారి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరిగాయని మోదీ తెలిపారు. అధ్యక్షుడు లూలా పర్యటనతో వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ ఒప్పందం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు కొత్త ఊపునిచ్చేలా ఉండనుందని అధికారులు భావిస్తున్నారు. వాణిజ్యం, సాంకేతికత, పునర్వినియోగ శక్తి, రక్షణ రంగాల్లో సహకారం పెరగనున్నది. భారత్–బ్రెజిల్ సంబంధాలు భవిష్యత్తులో మరింత విస్తరించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
