నడిగూడెం, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం,చెన్న కేశవపురం గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ గోసుల రాజేష్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఏఈ నడిగూడెం పర్యవేక్షణలో 10 లక్షల రూపాయలతో 8 వ వార్డు లో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ గోసుల రాజేష్ ,ఉపసర్పంచ్ కటికల పుల్లయ్య, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, మరియు గ్రామ పెద్దలు గుజ్జర్లపూడి అర్జున్ రావు, మేకల గోవర్ధన్ ,సంకోజు జానయ్య సంకోజు నిర్మల, చల్లా సత్యనారాయణ ,మేకల కృష్ణమూర్తి ,కొత్త ఉపేందర్, శేఖర్, మరియు ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొనుట జరిగినది.
