పామర్రు, మార్చి 4(నేటి తెలుగు పత్రిక ): ప్రాథమిక విద్యా దశ నుంచే చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని పామర్రు ఏఎన్ఎం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ అన్నప్పరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు. ఈనెల 1న జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పోలీస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో ఏఎన్ఎం విద్యార్థులు పాల్గొని విశేష ప్రతిభను కనబరిచి బహుమతులను సాధించారు. అండర్- 14 బాలుర, బాలికల విభాగం లో డి. వి కార్తీక్,కె. హన్విత్ రెడ్డి, డి ఝాన్సీ లక్ష్మి లు ప్రథమ స్థానంలో,కె. పాన్విక, సిహెచ్ నజరే, ఏ.లోహిత్, మెగా హర్ష, జి రేవంత్, ప్రణయ్,ద్వితీయ స్థానంలో నిలిచినారు. ఇదే విదంగా సిహెచ్ హన్విక తృతీయ స్థానంలో నిలిచి వెండి బంగారు, కాంస్యపథకాలతో పాటు ప్రశంసా పత్రాలను సాధించారు. కరాటి పోటీల్లో విజేతలైన విద్యార్థిని విద్యార్థులతో పాటు కోచ్ రామకృష్ణ ను బుధవారం వారం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల సమక్షంలో ప్రిన్సిపాల్ పూర్ణచంద్రారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులుశామ్యూల్, పాఠశాలఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
