Breaking News

లేగ దూడల పెంపకంలో మెలకువలు పాటించాలి.

పామర్రు, మార్చి 06 (నేటి తెలుగు పత్రిక ): లేగ దూడల పెంపకంలో మెలకువలు పశుపోషకులు తప్పక పాటించాలని గుడ్లవల్లేరు కి చెందిన పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డాక్టర్ జగన్నాధ రావు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కురుమద్దాలి పంచాయితీ లో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వ హించిన లేగదూడల ప్రదర్శనలో డాక్టర్‌ జగన్నాధ రావు మాట్లాడుతూ లేగ దూడల ను మూడు రకాలుగా విభజించారని వాటి లో 3నెలల వరకు ఆవుల నుంచి పాలు ఇవ్వవచచ్చని 3నెలలు తర్వాత దూడలకు ఫీ డు వేయాలన్నారు. అలాగే 6నెలల నుంచి సంవత్సరము వయస్సులో వివిధ టీకాలను వేయించవచ్చన్నారు. దాదాపు 35 లేగ దూడలను( ముర్రా జాతి, గిర్,పుంగనూరు ) ప్రదర్శించి గెలుపొందిన పాడి రైతులకు బహుమతులను అందజేశారు. గోకుల్ మిషన్ పశువైద్య అధికారిణి , డాక్టర్ రాధిక పామర్రు పశువైద్య అదికారి దేవరపల్లి సృజన్ కుమార్ లేక దూడల పెంపకంలో పశుపోషణకులకు వచ్చిన పలు సందేహాలను నివృత్తి చేశారు. ఏడీ శ్రీ లక్ష్మీనారాయణ పశు సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ అందాల పోటీలో ప్రధమ విజేతగా పిన్నమనేని అంజయ్య చౌదరి, జొన్నలగడ్డ రంగమ్మ,మండవ వెంకటేశ్వరరావులకు చెందిన లేదా దూడలు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు సాధించాయి. కన్సిలేషన్ బహుమతులుగా నూతక్కి శివరామకృష్ణ లక్ష్మణ రాజులకు చెందిన దూడలు విజేతలుగా నిలిచాయి. విజేతలుగా నిలిచిన లేక దూడల పశుపోషకులకు బహుమతులను అందజేశారు.గ్రామ సర్పంచి గొట్ర విజయభారతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పశు వైద్యసిబ్బంది మంగతాయారు, కోటిరెడ్డి, ఆలి, రమణ, కుమార్ అచ్యుత్, పద్మ, సుమిత్ర గోపి, తదితరులు పాల్గొన్నారు.

మున్నూరు కాపు కుటుంబ సర్వే ప్రారంభం.

ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలను నూరు శాతం అధికమించాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులదే : జి ఎస్ డబ్ల్యూ ఎస్ డిప్యూటీ ఎంపీడీవో సుబ్బారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *