నేటి తెలుగు పత్రిక,Mar 10: వరల్డ్ లీడర్స్ సమ్మిట్ అవార్డు గ్రహీత, సోషల్ ఆడిట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీకాంత్ గారు సమాజంలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన మరియు ప్రజా భాగస్వామ్యానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రతిభావంతుడైన అధికారి. గ్రామీణాభివృద్ధి, ప్రజా వేదికల నిర్వహణ, సోషల్ ఆడిట్ ప్రక్రియ బలోపేతం, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అనేక వినూత్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.
సామాజిక తనిఖీల ద్వారా ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత తీసుకురావడం, ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టడం, సాంకేతికతను వినియోగించి యూట్యూబ్ లైవ్ ప్రసారాలు, ప్రజా వేదికల ప్రత్యక్ష ప్రసారం వంటి ఆధునిక విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆయన సంస్థకు మంచి పేరు తీసుకువచ్చారు. ఆయన నాయకత్వంలో సోషల్ ఆడిట్ కార్యక్రమాలు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని మరింత బలోపేతం అవుతున్నాయి.
ఈ విశిష్ట సేవలకు గాను పలువురు ప్రముఖులు ఆయనను అభినందించారు. ముఖ్యంగా, దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం Padma Vibhushan గ్రహీత, ప్రముఖ నటుడు #chiranjeevi గారు శ్రీ జి శ్రీకాంత్ గారిని హృదయపూర్వకంగా అభినందించారు. #gsrikanth #megastar #ssaat రాష్ట్ర వ్యాప్తంగా 56 వేల రాయల్ వారసుల పక్షాన అభినందన మంధార మాల అందుకోవాలి..
ఇట్లు
సోమరౌతు రామకృష్ణ
కన్వీనర్
శ్రీ కృష్ణ దేవరాయ ఉద్యోగ జెఏసి
