మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లడంపై ఎలాంటి విమర్శలు సమంజసం కాదని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తమ పార్టీ జాతీయ పార్టీగా ఉండటంతో, అవసరమైతే ఎన్ని సార్లయినా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి నిధులు, హక్కులు సాధిస్తామని అన్నారు.గతంలో పదేళ్ల పాలనలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు కూడా ఢిల్లీకి అనేకసార్లు వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే విషయంపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం అవసరమని, నిధులు తీసుకురావడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లడంలో ఎలాంటి తప్పు లేదని, ఇకముందు కూడా ఇదే విధంగా కొనసాగుతామని స్పష్టం చేశారు.
