మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ కవిత కల్వకుంట్ల కొత్త రాజకీయ పార్టీపై సంకేతాలు ఇచ్చారు. పార్టీ అజెండాపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని, మంచి ముహూర్తం చూసుకుని త్వరలోనే కొత్త పార్టీని ప్రకటిస్తానని వెల్లడించారు. తాను మహాత్మా గాంధీ సర్వోదయ సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నానని పేర్కొన్న కవిత… తన రాజకీయ దిశ స్పష్టంగా ప్రజా సంక్షేమం వైపు ఉంటుందని సూచించారు. “డాడీ, మోడీ, చిన్న మోడీపై నా పోరాటం కొనసాగుతుంది” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.అలాగే, భారత రాష్ట్ర సమితితో తనకు ఉన్న విభేదాల అంశాన్ని భారత జాతీయ కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండటంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
