బెల్లంపల్లి, మార్చి 26 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి పట్టణంలోని 26వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాషా బాయ్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ గురువారం అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాష భాయ్ కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అంతరం అశోక్ నగర్ లో నివసిస్తున్న ఒక దివ్యాంగురాలు తన సమస్యను ఎమ్మెల్యే వినోద్ దృష్టికి తీసుకురావడంతో అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినోద్ వెంట పలువురు కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఉన్నారు.

