Breaking News

డీజిల్ ధరలు రైతులకి శాపం – బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆందోళన

హైదరాబాద్, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: వ్యవసాయం ప్రస్తుతంలో ఎద్దులు కాకుండా ట్రాక్టర్లపై ఆధారపడుతున్న నేపధ్యంలో, పెరుగుతున్న డీజిల్ ధరలు రైతులపై భారం అయ్యాయని తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. రైతుల భారాన్ని తగ్గించే ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఆయన సూచించారు.రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేవలం పన్నులపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి అని పాయల్ శంకర్ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వం నేరుగా చొరవ తీసుకుంటే, రైతులు, ప్రజలపై పన్ను భారం లేకుండా రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయలు సమకూరవచ్చని ఆయన చెప్పారు.అందుకే, అన్ని పార్టీ మేధావులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, రైతుల సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిందని పాయల్ శంకర్ హవల్ చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *