Breaking News

తెలంగాణలో పెట్టుబడులపై కేటీఆర్‌తో ఆస్ట్రేలియా ప్రతినిధుల చర్చ

మే 15, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. నందినగర్‌లో జరిగిన ఈ సమావేశంలో రెండు ప్రాంతాల మధ్య పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యం, విద్యా సహకారంపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.ఈ భేటీలో ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో తెలంగాణకు ఉన్న అవకాశాలపై ఆస్ట్రేలియా ప్రతినిధులకు కేటీఆర్ వివరించారు.హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న కార్యక్రమాలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాల గురించి కేటీఆర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల కల్పనపై కూడా చర్చ జరిగింది.భారత్–ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలపడే దిశగా ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఇరువర్గాలు అభిప్రాయపడ్డాయి. భవిష్యత్తులో తెలంగాణ–ఆస్ట్రేలియా మధ్య సాంకేతిక, ఆర్థిక, విద్యా రంగాల్లో కొత్త భాగస్వామ్యాలకు ఈ చర్చలు దోహదపడనున్నాయని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితా సవరణపై బీజేపీని లక్ష్యంగా చేసుకున్న మహేశ్ గౌడ్

ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల అధికారితో కాంగ్రెస్ నేతల భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *