మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్తో అనంతపురం జిల్లా భవిష్యత్తు మారబోతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ను ఉమ్మడి అనంతపురం జిల్లాకు “రిటర్న్ గిఫ్ట్”గా అభివర్ణించారు.పుట్టపర్తిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ, కియా పరిశ్రమ తర్వాత ఇప్పుడు ఫైటర్ జెట్ తయారీ కేంద్రం రావడం గర్వకారణమని పేర్కొన్నారు. రాయలసీమ కరువు నేలపై పరిశ్రమల విప్లవం జరుగుతోందని చెప్పారు.AMCA ప్రాజెక్ట్ ద్వారా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. DRDO, HAL సహా పలు రక్షణ రంగ సంస్థలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్ట్తో పుట్టపర్తి దేశ రక్షణ రంగంలో కీలక కేంద్రంగా మారనుందని అన్నారు.చంద్రబాబు నాయుడు దూరదృష్టి కారణంగానే కియా వంటి పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని, ఇప్పుడు అదే విజన్తో డిఫెన్స్ రంగం కూడా ఏపీకి వస్తోందని లోకేష్ తెలిపారు. ఇది కేవలం పరిశ్రమ కాదు, రాయలసీమ భవిష్యత్తుకు కొత్త దిశ అని వ్యాఖ్యానించారు.ఇక రాజకీయ విమర్శల నేపథ్యంలో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిని గుర్తించాల్సిన అవసరం ఉందని, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు
