మే 19, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ మంత్రి సీతక్క మరోసారి విద్యపై తన ఆసక్తిని చాటుకున్నారు. ఇటీవల నిర్వహించిన టీజీ పీజీఎల్సెట్ పరీక్షను ఆమె రాసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ‘కాన్స్టిట్యూషనల్ లా’లో ఎల్ఎల్ఎమ్ కోర్సు చేయాలని సీతక్క నిర్ణయించుకున్నట్లు సమాచారం.నక్సలిజాన్ని విడిచిపెట్టి 1990లలో ప్రజాజీవనంలోకి వచ్చిన సీతక్క, రాజకీయాలతో పాటు విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పొలిటికల్ సైన్స్లో పీహెచ్డీ పూర్తి చేసిన ఆమె.. ‘కార్పొరేట్ లా’లో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎమ్ డిగ్రీలను కూడా సాధించారు.ఆ తర్వాత ప్రజాప్రతినిధిగా ఎదిగి ఎమ్మెల్యేగా, అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ చదువుపై ఆసక్తిని మాత్రం తగ్గించలేదు. ప్రస్తుతం మరోసారి ఉన్నత విద్య కోసం పరీక్ష రాయడం చర్చనీయాంశమైంది.వయసు, పదవి, హోదా ఏదైనా సరే నేర్చుకోవాలనే తపన ఉంటే సాధించవచ్చని సీతక్క తన ప్రయాణంతో నిరూపిస్తున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు.
