మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ సివిల్ సప్లయిస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగితో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారినట్లు సమాచారం.తర్వాత ఇద్దరూ కలిసి గడిపిన వ్యక్తిగత ఫొటోలు, ఓయో గదుల బుకింగ్ స్లిప్పులను ఆధారాలుగా చూపిస్తూ బాధితుడిని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పలు దఫాలుగా అతడి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
