Breaking News

ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారింది

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోగా.. ఇంకా ఒకే బెర్తు మిగిలి ఉంది. ఆ ఒక్క స్థానానికి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కే ప్లేఆఫ్స్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 16 పాయింట్లతో నేరుగా అర్హత సాధించే అవకాశం ఉంది.పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ గరిష్ఠంగా 15 పాయింట్ల వరకు మాత్రమే చేరగలవు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ గరిష్ఠంగా 14 పాయింట్లతో ముగించే అవకాశం ఉంది.దీంతో ఈ నాలుగు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా రావాలని ఎదురుచూడాల్సి ఉంటుంది. నెట్ రన్‌రేట్ కూడా కీలకంగా మారే అవకాశముంది.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. భారీ నగదు బహుమతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *