Breaking News

బండి భగీరథ్ కేసు.. స్నేహితుల విచారణ!

మే 19, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సంచలనం రేపుతున్న బండి భగీరథ్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో భగీరథ్ స్నేహితులను కూడా విచారించాలని అధికారులు నిర్ణయించారు.బాధితురాలు, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదులో కీలక ఆరోపణలు చేసినట్లు సమాచారం. పలుమార్లు అఘాయిత్యాలు జరుగుతున్న సమయంలో భగీరథ్ స్నేహితులు అక్కడే ఉన్నారని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా కేసును రాజీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని, దీనికి సంబంధించి 10 మంది పేర్లను కూడా పోలీసులకు అందజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా వ్యక్తుల పాత్రపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.నేడు లేదా రేపటిలోపు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కేసులో ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో 16 వేల మెడికల్ షాపులు బంద్

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *