Breaking News

బండి భగీరథ్‌కు మరో షాక్.. అదనపు సెక్షన్ నమోదు

మే 20, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌పై పోలీసులు మరో సెక్షన్ నమోదు చేశారు. విచారణ సందర్భంగా భగీరథ్ పోలీసులకు ఖాళీ సెల్‌ఫోన్ మాత్రమే అందించాడని, అందులో సిమ్ కార్డు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.సిమ్ కార్డు గురించి ప్రశ్నించగా, “ఎక్కడో పెట్టి మర్చిపోయాను” అని భగీరథ్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో కేసుకు సంబంధించిన ఆధారాలను మాయం చేసినట్లు భావించిన పోలీసులు అదనంగా సెక్షన్ 238ను చేర్చినట్లు వెల్లడించారు.ఇప్పటికే పోక్సో కేసులో విచారణ కొనసాగుతుండగా, తాజా పరిణామం కేసులో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భగీరథ్ ఉపయోగించిన ఫోన్, సిమ్ కార్డు వివరాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *