Breaking News

మైనర్ బాలికతో వివాహం.. కానిస్టేబుల్‌పై కేసు

మే 20, (నేటి తెలుగు పత్రిక): యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నాయని అనిల్ కుమార్ మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు ఉద్యోగి ఇలాంటి చర్యకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అనంతగిరి మండలానికి చెందిన ఓ బాలికను ఈ నెల 9న అనిల్ కుమార్ వివాహం చేసుకున్నట్లు సమాచారం. బాలిక మైనర్ అని గుర్తించిన ఐసీడీఎస్ అధికారులు వెంటనే స్పందించి హుజూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక వయస్సు, వివాహ పరిస్థితులు, ఇతర సంబంధిత అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాల్య వివాహాల నియంత్రణకు చట్టాలు ఉన్నప్పటికీ, బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తే నిబంధనలు ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఫ్యూచర్ సిటీ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలే ముగింపు పలికారు: బండి సంజయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *