మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టుల నివాసాల కోసం 500 ఎకరాల భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పరిశ్రమల శాఖ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనకు సంబంధించిన ల్యాండ్ పూలింగ్ అంశాన్ని ఈ నెల 23న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోదించే అవకాశం ఉంది.ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఆధునిక సదుపాయాలతో నివాస ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
