Breaking News

జర్నలిస్టులు, అధికారుల నివాసాలకు 500 ఎకరాల కేటాయింపు

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టుల నివాసాల కోసం 500 ఎకరాల భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పరిశ్రమల శాఖ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనకు సంబంధించిన ల్యాండ్ పూలింగ్ అంశాన్ని ఈ నెల 23న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోదించే అవకాశం ఉంది.ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఆధునిక సదుపాయాలతో నివాస ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *