Breaking News

హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

మే 20, (నేటి తెలుగు పత్రిక): లేపాక్షి షోరూమ్‌లు, హస్తకళా ఉత్పత్తుల విక్రయాలపై మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని లేపాక్షి షోరూమ్‌లను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.ఇప్పటికే మరమ్మతులు పూర్తైన ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూమ్‌లను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే రాజమండ్రి ఎయిర్‌పోర్టులో కొత్త లేపాక్షి షోరూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.హస్తకళా ఉత్పత్తుల అమ్మకాలను పెంచేందుకు ఈ-కామర్స్ వేదికలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించిన మంత్రి.. వినియోగదారులకు నేరుగా డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. హస్తకళాకారులకు సంవత్సరంలో 365 రోజుల పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. సమావేశంలో లేపాక్షి ఎండీ విశ్వతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *