Breaking News

భానుడి భగభగ.. వడదెబ్బతో ఒక్కరోజే 9 మంది మృతి

మే 21, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. నిన్న తెలంగాణలోని 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై ఒక్కరోజే 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.మరో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లొద్దని, తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కార్మికులకు భారీ ఊరట.. జూన్ 1 నుంచి పెరగనున్న కనీస వేతనాలు

ఏఐ ప్రభావం.. బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు యువత అడుగులు వేయాలి: సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *