Breaking News

చంద్రబాబు పాలనపై జగన్ విమర్శలు.. “మోసం గ్యారంటీ” అంటూ ఫైర్

మే 21, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత రెండేళ్లలో ప్రజలకు ఉపయోగపడే పనులకంటే వెన్నుపోటు రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. “ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అవినీతి, మాఫియా రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారు” అని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం “జంగిల్ రాజ్” కొనసాగుతోందని, ప్రజలకు మంచి చేశామని చెప్పుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. “బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీగా పాలన మారిపోయింది” అంటూ జగన్ మండిపడ్డారు.

భానుడి భగభగ.. వడదెబ్బతో ఒక్కరోజే 9 మంది మృతి

“హత్యా రాజకీయాలు ఎవరివి?”.. టీడీపీపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *