మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండి భగీరథ్ పోక్సో కేసు అంశంపై స్పందించారు. ఈ కేసులో ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. బాధితురాలికి న్యాయం జరగకపోయేదని తమ పార్టీ జోక్యం వల్లే కేసు ముందుకు వెళ్లిందని తెలిపారు. నిందితుడిని కొన్ని రోజులు రేవంత్ రెడ్డి బంధువుకు చెందిన ఆస్పత్రిలో దాచారనే ఆరోపణలు చేశారు. అలాగే 28వ అంతస్తులో ఉంచినట్లు వీడియోలు చూశానని ఆయన పేర్కొన్నారు.
